మద్యం మత్తులో స్నేహితుల మద్య ఘర్షణ.. యువకుడు మృతి..

Warangal Bureau
1 Min Read

స్నేహితుల మద్య ఘర్షణ…సాయి అనే యువకుడు మృతి

  • ఖిలా వరంగల్ తూర్పు కోటలో దారుణం

వరంగల్, అక్టోబర్ 28 (ప్రజాజ్యోతి):

వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని ఖిలా వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణ దారుణానికీ దారితీసింది. స్నేహితుల మధ్య, మద్యం మత్తులో తలెత్తిన తగవులో సంగరబోయిన సాయి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సహచరులు అతడిని చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే అతడు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఘర్షణకు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. గొడవలో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఘటనతో సాయి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *