కిడ్నీ ఇచ్చి, పుస్తెలు అమ్మి వైద్యం అందించినా.. భర్తను కాపాడుకోలేక పోయింది.. చికిత్స పొందుతూ డిప్యూటీ తహసీల్దార్ మృతి..

Warangal Bureau
2 Min Read

వరంగల్, జూన్ 30 (ప్రజాజ్యోతి):

భార్య కిడ్నీ ఇచ్చిన, లక్షల అప్పు చేసి వైద్యం చేసిన బతుకలే..

– మృత్యువుతో పోరాడి ఓడిన డిప్యూటీ తాహసిల్దార్ రాజేష్ ఖన్నా

– భార్య బంగారం, నగలు అమ్మి వైద్యం అందించిన బ్రతికించుకోలేక పోయారు.

ఆత్మకూరు లో విషాద ఛాయలు

కిడ్నీ ఇచ్చి, పుస్తెలు అమ్మి వైద్యం అందించింది అయినా భర్తను బ్రతికించుకోలేక పోయింది అబాగ్యురాలు. గత నెల రోజులుగా మృతులతో పోరాటం చేసి ఆఖరికి అసువులు బాశాడు వరంగల్ జిల్లా లోని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఓ డిప్యూటీ తహసీల్దార్. నగరంలోని హనుమకొండ ప్రశాంత్ నగర్ లో నివాసం ఉండే అన్నబోయిన రాజేష్ కన్నా వరంగల్ జిల్లా నల్లబెల్లి డిప్యూటీ తాసిల్దారుగా పనిచేస్తున్నాడు. 8 ఏళ్ల క్రితం కిడ్నీ పాడవగా అతని భార్య కిడ్నీ దానం చేసింది. అప్పటినుండి ఆరోగ్యంగానే ఉన్న గత నెలలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో వైద్య ఖర్చులకోసం సుమారు 25 లక్షలు ఖర్చు చేశారు. భార్య నగలు బంగారం అమ్మి వైద్యం చేసిన ఫలితం దక్కలేదు. అతని వైద్యం కోసం రెవెన్యూ సంఘాల నాయకులు సైతం సహకారం అందించారు. అయినప్పటికీ అతని శరీరం వైద్యానికి సహకరించక మరణించాడు.

రాజేష్ ఖన్నా అత్తగారి ఊరు ఆత్మకూరు తో ఇతనికి మంచి సంబందాలు కలిగి ఉన్నాడు. అతని మృతితో ఆత్మకూరు లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

అతని మృతి పట్ల తన తోటి ఉద్యోగులు, రెవెన్యూ సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అతని కుటుంబానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం అతని కుటుంబానికి న్యాయం చేయాలని రెవెన్యూ సంఘాల నాయకులు విన్నవించారు.

  
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *