29న నర్సాపూర్’లో ఉద్యోగ మేళా
నర్సాపూర్(ప్రజాజ్యోతి): నర్సాపూర్ పట్టణంలోని పరిధిలోని సాయికృష్ణ గార్డెన్’లో ఈనెల 29న ’మెగా జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు.జాబ్ మేళాలో 60 కంటే ఎక్కువ ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయన్నారు. ఇందులో వెయ్యికి పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించిన నిరుద్యోగ యువతీ,యువకులు ఎస్ఎస్సి, ఇంటర్, డిప్లమా, డిగ్రీ, బీటెక్, పీజీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మేళా కొనసాగుతుందన్నారు.