ప్రజాపాలనలో రైతన్నలకు మేలు

Nalgonda Bureau
1 Min Read

ప్రజాపాలనలో రైతన్నలకు మేలు

 

పోచంపల్లిలో కాంగ్రెస్ రైతు సంబురాలు

 

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్

 

భూదాన్ పోచంపల్లి,
జూన్ 24, (ప్రజాజ్యోతి): కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతన్నలకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని నేతాజీ చౌరస్తాలో కాంగ్రెస్ పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రైతు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పోస్టర్లకు పాలాభిషేకం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం తొమ్మిది రోజులుగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిందని, వ్యవసాయాన్ని రైతులు పండగలా చేసుకోవాలని కోరారు. రైతు పెట్టుబడికి ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి రుజువు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్ పట్టణ అధ్యక్షుడు బారత లవకుమార్ కాంగ్రెస్ నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *