శ్రీ సాయి త్రివేణి డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి

Nalgonda Bureau
1 Min Read

శ్రీ సాయి త్రివేణి డిగ్రీ కళాశాలలో

 

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి

 

సూర్యాపేట: మలి దశ ఉద్యమానికి ఊపిరి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని శ్రీ సాయి త్రివేణి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ పెసర జనార్దన్ రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి త్రివేణి డిగ్రీ కళాశాలలో శనివారం ఆయన చిత్రపటానికి ఘనంగా పూల మాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు అహర్నిశలు శ్రమించిన గొప్ప మేధావి, దురంధరుడు, రాజనీతిజ్ఞుడని, ఉద్యమానికి దిక్సూచిగా ఉద్యమ పాఠాలు, సందేశాలను అందిస్తూ బాసటగా మరణించేవరకు ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా పరితపించేవాడని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి త్రివేణి డిగ్రీ కళాశాల డైరెక్టర్ దిర్శనపు అనిల్, ప్రిన్సిపాల్ తన్నీరు ఉపేందర్, అధ్యాపకులు, గంజికుంట్ల గోపీనాథ్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఉయ్యాల నరసయ్య, ఆవుల అంజయ్య, రేగట్టే మల్సూరు, మండల్ రెడ్డి మల్లారెడ్డి, బెజవాడ నాగేశ్వరరావు,వెంకట్ కళాశాల సిబ్బంది , కోడి లింగయ్య, నాగరాజు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *