ఐదుగురిపై కేసు, ఇద్దరు అరెస్ట్.
– పరారీలో మరో ముగ్గురు
– 20తులాల బంగారం, 25తులాల వెండి స్వాధీనం
– కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం, (ప్రజాజ్యోతి)
కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో కన్నపు దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు శుక్రవారం ఇద్దరిని అరెస్టు చేశారు.పోలీస్ కమీషనరేట్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ సీపీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటయ్యపల్లి గ్రామంలో ఈనెల 8న సాయంత్రం ఎవరు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తలుపు గడియలను పగలగొట్టారు. ఇంట్లోని రెండు అల్మారాలను పగలగొట్టిన దొంగలు 33 తులాల బంగారు ఆభరణాలు, రూ.12,500 విలువైన వెండి, రూ.25,000 నగదుతో ఎత్తుకెళ్ళారని గ్రామానికి చెందిన బాధితుడు ఉప్పుగండ్ల గంగారెడ్డి గంగాధర పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు..ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగలను పట్టుకోవడానికి రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్,సీసీఎస్ పోలీసులతో పాటు గంగధార పోలీసులు అన్ని చర్యలు చేపట్టి 5గురి నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. వీరిలో రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట్ కు చెందిన గాజుల హేమంత్ (19) అనే యువకుడిని అతని స్నేహితుడైన కొమ్ము నవీన్ కుమార్ (20)లను అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద నుండి దొంగిలించబడిన 20 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి వస్తువులు, ఒక ప్యాషన్ ప్లస్ మోటార్సైకిల్, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని, ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
పోలీసులను అభినందించిన సీపీ…
బంగారు ఆభరణాల్లో కొన్నింటిని శుక్రవారం ఉదయం నింధితులు కొమ్ము నవీన్ అనే తన స్నేహితుడికి అమ్మినట్లు, నవీనన్ను కరీంనగర్లోని బన్ స్టాండ్ వద్ద దించి, మిగిలిన బంగారం అమ్మడానికి జగిత్యాలకు వెళుతుండగా గంగాధర క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. హేమంత న్ను అతని ద్వారా కరీంనగర్ లో కొమ్ము నవీన్ ను అరెస్ట్ చేశారు. దొంగతనానికి పాల్పడినన నేరస్థులను గుర్తించి పట్టుకుని వారినుండి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేయటంలో కృషి చేసిన రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ రాజు,గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ, సీసీఎన్ ఎన్ఐఐ నాగరాజు వారి సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సురేంద్రపాల్, కానిస్టేబుళ్లు రవీందర్, అవినాష్, సాయి, సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కానిస్టేబుల్ ప్రదీవ్లలను పోలీసు కమీషనర్ ప్రత్యేకంగా అభినందించారు.