అకాల వర్షం భారీ నష్టం
* కురుకుపోయిన డ్రైనేజీ చెత్తాచెదారం
* విద్యుత్ అంతరాయం
* విరిగిపోయిన కరెంటు పోల్స్
* నెహ్రూ విగ్రహం పై విరిగిన కరెంటు పోల్
* కాలేజ్ వద్ద 11 కెవి ట్రాన్స్ఫార్మర్ వైరు తెగిపోవడం
రామారెడ్డి జూన్ 09 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో భారీగా కురిసిన అకాల వర్షానికి చాలాచోట్ల అంతరాయం అదేవిధంగా చెట్లు విరిగిపోయాయి. కామారెడ్డి నుండి కామారెడ్డి వచ్చే ఆర్ అండ్ బి రోడ్డు పై చెట్టు విరిగిపోవడం జరిగింది. చాలా చోట్ల విద్యుత్తు స్తంభాలు విరిగి వైర్లు తెగిపోవడం జరిగింది. బీభత్సమైన గాలి దుమానం వలన చాలా చోట్ల ప్రజలకు అంతరాయం కలిగింది. విద్యుత్ సిబ్బంది. విద్యుత్ సరఫరా సరి చేసే పనిలో ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు, నివాసపు కాలనీ ఏరియాలలో వర్షం నీరు నిల్వ ఉండడంతో అవస్థలు పడుతున్న పలు కుటుంబాలు, గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇళ్లలోకి డ్రైనేజీ వర్షపు నీరు మురుగు నీరు రావడం జరుగుతుందని ప్రజలు ఆ ఆవేదన చెందుతున్నారు. విద్యుత్ శాఖ వారు విద్యుత్ సరఫరా సరి చేస్తున్నారు. సమయ భావం పట్టే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా వారి సూచనలను ప్రజలకు తెలపడం జరిగింది. ఈ యొక్క వరద బీభత్సం వలన పెంకుటిల్లు లు సైతం కురుస్తున్నాయి. రేకుల షెడ్లు తొలగిపోయాయి. ఇక గ్రామ ప్రజలు రోడ్డు పైకి వచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలని స్వచ్ఛంద సేవకులు కోరుతున్నారు.