తెలంగాణలో 2 లక్షల మార్కు దాటిన ‘ఈవీ’లు

V. Sai Krishna Reddy
1 Min Read

పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఈవీల వల్ల ఈ సమస్య ఉండదు. దీంతో కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీ వాహనాల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) సంఖ్య 2 లక్షల మార్కును అధిగమించింది.

కాలుష్య నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఈవీ పాలసీతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31) నాటికి రవాణాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.96 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఏప్రిల్ నెలాఖరుకు ఆ సంఖ్య 2 లక్షలు దాటినట్లు రవాణాశాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధికంగా (80 శాతం పైగా) బైక్‌లు ఉండగా, ఆ తర్వాత కార్లు ఉన్నాయి.

ఈవీ వాహనాలతో యజమానులకు, పర్యావరణానికి మేలు జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ఖర్చుతో పోలిస్తే ఛార్జింగ్ ద్వారా వాహన యజమానులకు ఖర్చు బాగా ఆదా అవుతోంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *