వరంగల్ జిల్లా మొగిలిచర్ల లో ఆదివారం రాత్రి రోడ్డుపై ఆరబెట్టుకున్న మక్కలు దగ్ధమయ్యాయి. గాలి దుమారంతో వీచడంతో నిప్పురవ్వ పడి మక్కలు పూర్తిగా దగ్ధమై అగ్నికి ఆహుతయ్యాయి. భారీ గాలి వీయటంతో మంటలు పెద్ద మొత్తంలో ఎగిసి పడ్డాయి. చేతికందిన పంట కళ్ళ ముందే కాలుతుంటే రైతులు చేసేదేమి లేక బోరున విలపించారు.
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బాధిత రైతులను పరామర్శించి ఓదార్చారు. బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందే విధంగా రైతుల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.