కాంగ్రెస్ పార్టీ అణుబాంబులాంటిది: మాజీ మంత్రి మల్లారెడ్డి

V. Sai Krishna Reddy
1 Min Read

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అణుబాంబులాంటిదని… దాని దృష్టి బీఆర్ఎస్ పై పడిందని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని మటాష్ చేయాల్సిందేనని చెప్పారు. కేటీఆర్ అధ్యక్షతన ఈరోజు కీలక సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ పాలన దారుణంగా ఉందని, ఆ పార్టీని మటాష్ చేయాల్సిందేనని మల్లారెడ్డి చెప్పారు. అణుబాంబులాంటి కాంగ్రెస్ పై జపాన్ సైనికుల మాదిరి మనం పోరాటం చేయాలని అన్నారు. అప్పుడే గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.

పార్టీ కోసం ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో భవిష్యత్తులో వారికే పదవులు వస్తాయని తెలిపారు. ఈ సమావేశానికి వచ్చిన నేతలు భవిష్యత్తులో ఎంపీలు, మంత్రులు కావచ్చని ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *