కేసు కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

V. Sai Krishna Reddy
1 Min Read

గతంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రేవంత్ రెడ్డిపై గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

గోపన్‌పల్లిలోని భూవివాదంలో ఒక వ్యక్తి ఫిర్యాదు మేరకు 2016లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణలో ఉంది. ఆ కేసును కొట్టివేయాలంటూ 2020లో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి, ఆ పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *