పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.

V. Sai Krishna Reddy
1 Min Read

పదో తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవి.. టెన్త్ ఫలితాల అనంతరం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. అందుకే.. పదో తరగతి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంటుంది.. కాగా.. తెలంగాణలో మార్చి 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 2 (బుధవారం)తో ముగిశాయి. మొత్తం 2,650 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలుస్తోంది.. పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు మినహా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో.. తెలంగాణ ఎస్సెస్సీ బోర్డు ముూల్యాంకనం నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. పరీక్షలను నిర్వహించిన ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ ఏప్రిల్ 7 నుండి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 శిబిరాల్లో సమాధాన పత్రాల స్పాట్ మూల్యాంకనాన్ని నిర్వహించనుంది. దీని తర్వాత ఫలితాలు వెలువడనున్నాయి.. మూల్యాంకనం పూర్తవ్వడానికి దాదాపు 20 రోజులు పడుతుంది. ఆ తర్వాత ఫలితాలను వెల్లడించనున్నారు. అయితే.. పరీక్ష ముగిసిన ఒక నెలలోపు ఫలితాలను వెల్లడించినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *