ఉగాది సందర్భంగా ఎడ్లబండ్లతో ఊరేగింపు
రామారెడ్డి మార్చ్ 31 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండల కేంద్రంలో ఉగాది పండుగను పురస్కరించుకొని రామారెడ్డి గ్రామంలో అత్యంత వైభవంగా బండ్ల ఊరేగింపును ఉత్సాహంగా ప్రదర్శించారు.
అలంకరించి ఎడ్ల బండ్లను డప్పు చప్పుల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. ఎడ్లబండ్ల ప్రదర్శనను తిలకించేందుకు మండల కేంద్ర ప్రజలతోనీ ప్రజలు భారీ సంఖ్యలో తిలకరించారు.ఈ ఎడ్ల బండ్ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎడ్లబండ్ల ప్రదర్శనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు తలెత్తకుండా స్థానిక పోలీసుల పర్యవేక్షణ లో, ఉగాది పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.