శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు శుభం కలగాలని, దేవి దేవతల కరుణాకటాక్షాలు అందరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు.