SLBC టన్నెల్‌లోకి వెళ్లిన రోబోలు

V. Sai Krishna Reddy
1 Min Read

SLBC సొరంగం కూలిపోవడం వల్ల చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రోబోలను ఉపయోగిస్తున్నారు. ఆటోనమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబోలు మట్టిని త్వరగా తొలగిస్తున్నాయి. ప్రస్తుతం 7 మంది కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 21 రోజులుగా జరుగుతున్న ఈ రెస్క్యూ కార్యక్రమంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. SLBC టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌లోకి రోబోలు ఎంటర్‌ అయ్యాయి. టన్నెల్‌లోకి వెళ్లిన అటానమస్‌ హైడ్రాలిక్‌ పవర్డ్‌ రోబో.. మట్టి తవ్వకాలను వేగవంతం చేస్తోంది. ఫలితంగా టన్నెల్‌లో అదృశ్యమైన మిగిలిన కార్మికులను గుర్తించేందుకు రెస్క్యూ టీమ్‌లు శ్రమిస్తున్నాయి. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌ 21రోజులుగా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా.. కేరళ కెడావర్‌ డాగ్స్‌ గుర్తించిన డీ-1, డీ-2 ప్రాంతాల్లో తవ్వకాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మాన్యువల్ డిగ్గింగ్‌కు బదులుగా ఆటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోలను వాడుతున్నారు. ఈ రోబో మోడ్రన్‌ టెక్నాలజీతో టన్నెల్ లోపల డిగ్గింగ్ ప్రక్రియ డిగ్గింగ్ ప్రక్రియలో ఏర్పడే మట్టిని వేగంగా బయటకు తీయడానికి సహాయపడతాయి. గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా తరలించనున్నారు అధికారులు. ఈ అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్‌ రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 30 హార్స్‌ పవర్‌ సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్‌లను కూడా టన్నెల్‌ లోపలికి పంపారు. ఈ యంత్రాలు మట్టిని త్వరగా తొలగించేందుకు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. మరోవైపు.. సహాయక చర్యలకు అడ్డుగా నిలిచిన టీబీఎం వెనక భాగాన్ని గ్యాస్ కట్టర్లు, ప్మాస్లా కట్టర్లు, అల్ట్రా ధర్మల్ కట్టర్లో కత్తిరించి ఎప్పటికప్పుడు ఆ భాగాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపుతున్నారు.నిర్వహించనుంది.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *