147 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
5 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
2.61 శాతం పెరిగిన ఎం అండ్ ఎం షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల మధ్య ఉదయం మన మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి వెళ్లాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడింది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయింట్ల లాభంతో 74,602కి పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 22,547కి పడిపోయింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.21గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (2.61%), భారతి ఎయిర్ టెల్ (2.55%), బజాజ్ ఫైనాన్స్ (1.65%), జొమాటో (1.37%), నెస్లే ఇండియా (1.34%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.58%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.25%), టీసీఎస్ (-1.19%), టెక్ మహీంద్రా (-1.15%), ఏషియన్ పెయింట్ (-1.04%).