అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత… కేసు నమోదు
చేర్యాల ఫిబ్రవరి 26(ప్రజాజ్యోతి):అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను చేర్యాల పోలీసులు పట్టుకున్నారు. చేర్యాల మండలంలోని అర్జున్ పట్ల గ్రామంలోని వాగులో గురువారం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుండడంతో మూడు ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసి సీజ్ చేశామని చేర్యాల ఎస్ఐ అపూర్వ రెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.
