బీజేపీ ఎంపీ ఈటల, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మధ్య వాగ్వాదం

V. Sai Krishna Reddy
1 Min Read

బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, బీఆర్ఎస్ శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఇరువురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వంతెన నిర్మాణానికి నిధులు తెచ్చింది తామంటే తామేనని ఇరువురు నేతలు వాదోపవాదనలకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు నాయకుల మధ్య తోపులాట కూడా జరిగింది. మర్రి రాజశేఖర్ రెడ్డితో వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఈటల రాజేందర్ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *