ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని అమీర్పేట నివాసంలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ రాజకీయ పక్షాల నాయకులు, ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె మృతికి సంతాపం తెలుపుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
