దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శివాజీ వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి వంటి వారు తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో శివాజీకి మద్దతుగా నిలుస్తూ సీనియర్ నటి రాశి ఓ వీడియో విడుదల చేశారు. ఓ టీవీ కార్యక్రమంలో తనపై యాంకర్ అనసూయ చేసిన ‘రాశిగారి ఫలాలు’ అనే డబుల్ మీనింగ్ డైలాగ్ పై రాశి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాశికి అనసూయ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
