రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్ ప్రెస్ వేపై ట్రాఫిక్‌ జామ్‌.

V. Sai Krishna Reddy
0 Min Read

హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో మూడు కార్లు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. పీవీ ఎక్స్ ప్రెస్ వే పై జరిగిన ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. పిల్లర్‌ నెంబర్‌ 253 వద్ద జరిగిన ఈ ప్రమాదం కారణంగా పీవీ ఎక్స్ ప్రెస్ వేపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఉప్పర్‌పల్లి నుంచి ఆరాంఘర్‌ చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి.

ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *