హైదరాబాద్ పాతబస్తీలో రియల్టర్ దారుణ హత్య

V. Sai Krishna Reddy
1 Min Read

హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు, వారు బాధితుడి బంధువులేనని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ జునైద్ (30) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే జునైద్‌పై కొందరు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు జునైద్‌ను సంతోష్‌నగర్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మిర్చౌక్ ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించారు. నిందితులు, బాధితుడు ఇద్దరూ బంధువులేనని, హత్యకు గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. కుటుంబ కలహాలు లేదా వ్యాపార లావాదేవీలు ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *