పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి.. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

Warangal Bureau
1 Min Read
  • పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి
  • వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

వరంగల్, సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి):

పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన యం. సాంబరెడ్డి, పి. జైపాల్, పోతు లక్ష్మారెడ్డి, డి. వెంకటేశ్వర్లు, యం. సాంబయ్య, కె. వెంకన్న, డి. సమ్మిరెడ్డి, యం. లక్ష్మీ నారాయణ, పి. శ్రీనివాస్ రాజు, ఎస్. సదయ్య లు అదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుష్టాలు అందజేశారు. ఈ సందర్భంగా కు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను అలంకరించి అభినందనలు తెలియజేసారు అనంతరం సీపీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసుల పట్ల భరోసా నమ్మకాన్ని కలిగించడంతో పాటు, నిరుపేద ప్రజలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పదోన్నతి పొందిన ఎస్ఐలకు సూచించి, శుభాకాంక్షలు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *