సూర్యాపేట జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 04(ప్రజాజ్యోతి):వినాయకుడి నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఊరేగింపు సమయంలో డీజేలకు అనుమతి లేదని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ గురువారం నాడు ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.నిబంధనలను అతిక్రమించి డీజేలను ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.నిమజ్జన సమయంలో చెరువులు,వాగుల వద్దకు చిన్నపిల్లలను తీసుకుపోరాదని సూచించారు.అదేవిధంగా మునగాల మండల కేంద్రంలోని ఎన్ఎస్పి కెనాల్ వద్ద వినాయకుల నిమజ్జనాలకు అనుమతి లేదని ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించాలని ఎస్సై సూచించారు.మండల ప్రజలు శాంతి భద్రతలను కాపాడుతూ సాంప్రదాయ బద్ధంగా ఉత్సవాలను నిర్వహించాలని ఎస్సై సూచించారు.
