ఏపీలో గణేశ్ శోభాయాత్రలో విషాదం.. నలుగురి మృతి

V. Sai Krishna Reddy
0 Min Read

పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం మండలం, తూర్పుతాళ్ల గ్రామంలో గణేష్ శోభాయాత్ర విషాదకరంగా ముగిసింది. శోభాయాత్రలో ట్రాక్టర్ అదుపు తప్పి భక్తులపైకి దూసుకువెళ్లడంతో నలుగురు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను తూర్పుతాళ్ల గ్రామానికి చెందిన సూర్యనారాయణ (52), మురళి (33), నరసింహమూర్తి (32), దినేశ్ (10)గా గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *