శివంపేట్:గుర్తుతెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా శివంపేట్ మండల పరిధిలోని మాగ్ధపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శివంపేట్ ఎస్సై సాయిలు, తూప్రాన్ సీఐ రంగాకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ రంగా కృష్ణ మాట్లాడుతూ క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత విచారణ చేపట్టి, మృతి దేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.