రాయ పోల్ 11 ప్రజా జ్యోతి
మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని,వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస అన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మానస మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఆర్టీవో జారీచేసిన చట్ట ప్రకారమే వాహనాల్లో పరిమితికిమించి ప్రయాణికులను ఎక్కించవద్దని, డ్రైవర్ ముందు సీటులో కుడి ఎడమ పక్కన ఎవరిని కూర్చోపెట్టరాదని తెలిపినారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, అర్.సి. ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రలు కలిగివుండాలని, వాహనానికి సంబందించిన సర్టిఫికెట్లు లేకుండా ఎవరైనా వాహనం నడిపితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటోలను రోడ్డుపై నిలపడం వల్ల ఇతర వాహనాలు రోడ్డుపై నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. 18 సంవత్సరాలలోపు పిల్లలు వాహనాలు నడపరాదని, అలా నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ, ఆటోలో పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టుకొని ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎవరైనా సెల్ ఫోనులో మాట్లాడుతూ వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రాంగ్ రూట్ లో ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్న వారికి జరిమానా విధిస్తామని,ఆటో ముందు సీట్లో డ్రైవర్ పక్కన ఎవరినైనా కూర్చున్నపెట్టుకున్నచో ఈ-చాలన్ ద్వారా జరిమానా విధిస్తామని తెలిపినారు. విద్యార్థులు ఉన్నతంగా ఉన్నత ఆశయాలతో చదువుకోవాలని సూచించారు. యువత గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.