కస్టమర్లకు ఆ ఆరు బ్యాంకులు శుభవార్త! ఆ ఖాతాల మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు రద్దు

V. Sai Krishna Reddy
1 Min Read

దేశంలోని కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు ఇది శుభవార్త. సేవింగ్స్ ఖాతాలలో కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) లేకుంటే విధించే ఛార్జీలను పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి. ఈ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా మరిన్ని బ్యాంకులు ఈ జాబితాలో చేరాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల జూలై 1, 2025 నుంచి తమ సాధారణ సేవింగ్స్ ఖాతాలపై ఈ ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రీమియం ఖాతాలకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది. ఇదే బాటలో ఇండియన్ బ్యాంక్ కూడా జూలై 7, 2025 నుంచి అన్ని రకాల పొదుపు ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

కెనరా బ్యాంక్ కూడా ఈ ఏడాది మే నెలలో సాధారణ సేవింగ్స్ ఖాతాలతో పాటు ఎన్ఆర్ఐ, శాలరీ ఖాతాలపై కూడా ఈ ఛార్జీని తొలగించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వినియోగదారులకు ఊరటనిస్తూ ఇదే విధమైన నిర్ణయం తీసుకున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా గతంలోనే ఈ ఛార్జీలను రద్దు చేసింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, ఖాతాదారులకు ఆర్థిక సౌలభ్యాన్ని పెంచే లక్ష్యంతో బ్యాంకులు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *