జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలిక దారుణ హత్య

V. Sai Krishna Reddy
1 Min Read

జగిత్యాల జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కోరుట్ల గ్రామంలో ఐదేళ్ల బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేయబడింది.

కోరుట్ల పట్టణానికి చెందిన బాలిక శనివారం సాయంత్రం నుండి కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారి ఇంటి సమీపంలోని ఒక ఇంటిలోని బాత్రూంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

బాత్రూంలోనే బాలిక గొంతు కోసి హత్య చేయబడిందని తల్లిదండ్రులు గుర్తించారు. బాలిక మృతదేహం లభించిన ఇంటి యజమాని పరారీలో ఉన్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

అభం శుభం తెలియని ఐదేళ్ల చిన్నారి దారుణంగా హత్యకు గురికావడం అందరినీ కలచివేసింది. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *