వెల్దుర్తి :వెల్దుర్తి పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ లోని చోరీకి ప్రయత్నించిన ఘటన ఆదివారం అర్ధరాత్రి వెలుగు చూసింది.దుండగులు బ్యాంకు ప్రహరీ గోడకు కన్నం వేసి బ్యాంకులోకి ప్రవేశించారు. స్ట్రాంగ్ రూమ్ లోకి ప్రవేశించే క్రమంలో బ్యాంకులో ఉన్న ఎమర్జెన్సీ అలారం మోగడం వలన ఫలితం లేకపోవడంతో దుండగులు అక్కడి నుండి పారిపోయారు. అలారం పోవడంతో అప్రమత్తమైన స్థానికులు సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్,సిఐ రంగా కృష్ణ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.