కరీంనగర్ బ్యూరో, జూన్ 26, (ప్రజాజ్యోతి)
ఫుట్బాల్ విశ్వ క్రీడని, ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకత కల్గిన క్రీడగా ఖ్యాతిచెందినదని ముఖ్యంగా ఈ క్రీడలో పాల్గొనడానికి యువకులు మరియు విద్యార్థులు ఆసక్తి చూపుతారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఫుట్బాల్ అతి పురాతనమైన క్రీడా అని తెలుపుతూ ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి ప్రదర్శించడమే కాకుండా వాటిలో పాల్గొని పెంపొందించుకొని విజయవకాశాలను మెరుగుపరచుకోవాలని సూచించారు విద్యార్థుల్లో విశ్వాసం నింపడానికి, క్రీడల పట్ల దృష్టి మళ్లించడానికి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలో నిర్వహింపబడే పోటీలకు ఎంపిక చేస్తూ వారికి అన్ని రకాలుగా చేయూతనిస్తున్నామని చెప్పారు.ఈ క్రమంలో ఇటీవల కాలంలో పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం గ్రామంలో గల ఫుట్బాల్ మైదానంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి అంతర్ జిల్లా బాలుర ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలలో పాఠశాలకు చెందినటువంటి కె. రిషిరెడ్డి, 9వ తరగతి, జి. హేమంత్ జాదవ్, 10వ తరగతి, సబ్-జూనియర్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడమే కాకుండా త్వరలో నిజామాబాద్ లో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవడం చాలా హర్షదాయకమని తెలుపుతూ విజేతలకు పుష్పగుచ్చాలను అందజేసి రాష్ట్ర స్థాయిలోను అఖండ విజయాలను నమోదు చేసి జాతీయ స్థాయిలోను ప్రతిభ చాటి విజయం సాధించాలని ముందస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ ఇ-టెక్నో విద్యార్థులు
Leave a Comment