ఇచ్చిన మాట నిలుపుకున్న సర్కార్…. రైతు భరోసా నిధులతో రైతుల కళ్లలో ఆనందం …! కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి

Nalgonda Bureau
1 Min Read

ఇచ్చిన మాట నిలుపుకున్న సర్కార్….

రైతు భరోసా నిధులతో రైతుల కళ్లలో ఆనందం …!

కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి

మిర్యాలగూడ, జూన్ 24(ప్రజాజ్యోతి): ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు భరోసా నిధులను శరవేగంగా విడుదల చేయడం తో రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్నామన్నారు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మిర్యాలగూడ రైతు వేదిక వద్ద రైతులతో కలిసి రైతు భరోసా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతులందరికీ రైతుబంధు నిధులు విడుదల చేసి రైతుల శ్రేయస్సు ముఖ్యమని మరొకసారి రుజువు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని దేశంలో ఏ పార్టీ కూడా రైతు శ్రేయస్సు కోసం ఇంత పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల కోసం రైతుల అభివృద్ధి కోసం కట్టుబడిందని, ఇచ్చిన 6 గ్యారంటీలను అతి తక్కువ కాలంలోనే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి మరొకసారి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకుందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం ఎమ్మెల్యే బి ఎల్ ఆర్, ఎమ్మెల్సీ కేతువత్ శంకర్ నాయక్ ల ఆధ్వర్యంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తలకొప్పుల సైదులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకునూరు బసవయ్య గౌడ్, డిప్యూటీ తహసీల్దార్, మాజీ సర్పంచ్ జంగిలి లింగయ్య యాదవ్, రైతులు జెట్టి వెంకటయ్య, పర్వతం ఎల్లయ్య, బిక్షపతి, కృష్ణ, కారంపూడి రవి, దీరావత్ సైదా నాయక్, స్వామి నాయక్ ఏవోలు ఏఈవోలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *