కాపుగల్లుకు వంద ఎల్ఈడీ వీధిలైట్లు బహూకరణ…..
కోదాడ టౌన్,జూన్ 24 (ప్రజా జ్యోతి): కోదాడ మండల పరిధి కాపుగల్లు గ్రామ వాసి, బీఆర్ఎస్ నాయకుడు దొంతగాని అప్పారావు గ్రామానికి రూ.లక్ష విలువ గల 100 ఎల్ఈడీ వీధిలైట్లు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణాలకు ధీటుగా పల్లెలు అభివృద్ధి సాధిస్తే, రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెలు అభివృద్ధికి ఆమాడ దూరంలో నిలిచాయన్నారు. ఇప్పటికైనా పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం దృష్టి సారించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా బోసుబాబు, గోపి, కాసాని గోపి, శ్రీను, వెంకటనారాయణ, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, నరేశ్, సీతారాములు పాల్గొన్నారు.