హుజూర్నగర్ పట్టణానికి చెందిన కోలా నాగేశ్వరరావు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఆదివారం ఎన్నికయ్యారు.హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర మహాసభ సందర్భంగా తెలంగాణ ఉపాధ్యక్షులుగా రాష్ట్ర ఎన్నిక కాగా కోల నాగేశ్వరరావుకి నియామక పత్రంను రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లేపల్లి వెంకటేశ్వర్లు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. మూడు దశాబ్దాలుగా హుజూర్ నగర్ ప్రాంతంలో మున్నూరు కాపుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని అన్నారు. తన నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.కోల నాగేశ్వరరావు నియామకం పట్ల మున్నూరు కాపు సంఘం నాయకులు కామిశెట్టి వెంకటేశ్వర్లు, శాసనాల నాగ సైదయ్య, కాసర్ల నాగేశ్వరరావు, పి. నాగేశ్వరరావు,గంధం శ్రీనివాసు, సి. రాఘవయ్య,వెంకటేశ్, రాము లు హర్షం వ్యక్తం చేశారు.