అర్ధ శతబ్దాం తరువాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ను ఘనంగా నిర్వహించుకున్నారు.ఆదివారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ పాఠాశాల లో 1974-75 లో 8వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు సిహెచ్ మల్లయ్య ఆధ్వర్యంలో స్థానికంగా అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు.తాము సుదీర్ఘకాలం తర్వాత,కలుసుకున్న మిత్రులందరూ తమ తమ అనుభవాలను,తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరి తో ఒకరు పంచుకొని ఆత్మీయతను చాటుకున్నారు.తమ నుండి గతించిన తోటి విద్యార్థులకు ఉపాధ్యాయుల కు అంజలి ఘటించారు.50 సంవత్సరాల తరువాత విడిపోయిన తమ స్నేహితులను ఒక వేదిక మీదికి చేర్చడం ఒక అద్భుతం అని తమ జీవితం లో మరుపురాని ఘట్టం గా గుర్తుపెట్టుకుంటామన్నారు.తమ కు 64 సంవత్సరాలు ఉంటాయని,తాము 5 తరాలను చుసినవారవడం,మేము మరల కలుసుకొని మాట్లాడుకోవడం,నేర్చుకున్న అనుభవాలను పంచుకున్నారు.తమ గురువులు రంగారెడ్డి,అహల్య,సోమయ్య, సత్తయ్య లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అర్థ శతాబ్దం తర్వాత అందరిని ఒకే చోట కలుసుకునే విధంగా చేసిన ఆర్గనైజర్ లను అభినందించారు.ఈ అపూర్వక కలయిక లో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బింగి లక్ష్మయ్య,పోగుల వెంకట్ రెడ్డి,దొంగరి గోవర్ధన్,సోమిరెడ్డి,పద్మ,యాదగిరి,వెంకటయ్య, వెంకటమ్మ,పిచ్చమ్మ తో పాటు పలువురు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.