రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుందాం
నిజాంసాగర్ ప్రజా జ్యోతి జూన్ 22
జాతీయ రహదారి 161లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు జాగ్రత్తగా పై నిజాంసాగర్ మండలంలోని జాతీయ రహదారి 161లో శనివారం సాయంత్రం హైవే సిబ్బంది వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులు జాతీయ రహదారి నియమ నిబంధనలను మరియు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు హైవే సిబ్బంది వివరించారు. జాతీయ రహదారి 161 నిబంధన పాటించి ప్రమాదాలు జరగకుండా ప్రాణాన్ని కాపాడుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఆర్ఓ టీం, ఆర్పివి టీం, అంబులెన్ సిబ్బంది ఉన్నారు.