వెల్ నెస్ సెంటర్ లో మందుల కొరతపై కలెక్టర్ కు ఫిర్యాదు
కలెక్టర్ ను కలిసిన టీయుడబ్ల్యూజె బృందం
నిజామాబాద్ :
కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని టీయుడబ్ల్యూజె – ఐజెయు బృందం శనివారం మర్యాద పూర్వకంగా కలిసారు. కలెక్టర్ ను శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్బంగా నిజామాబాద్ వెల్ నెస్ సెంటర్ లో మందుల కొరతపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇస్తామని, మందుల కొరత లేకుండా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొబ్బిలి నర్సయ్య, అహ్మద్ అలీఖాన్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు గంగాదాస్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి భైర శేఖర్, జిల్లా కోశాధికారి సిరిగాధ ప్రసాద్, ఎలకాట్రానిక్ మీడియా కార్యదర్శి ధనుంజయ్, చతుర్వేదం, మహేష్ రెడ్డిలు పాల్గొన్నారు.
సాయిలుకు పరామర్శ…
బోధన్ ప్రజాజ్యోతి ఆర్సి ఇంచార్జీ టప్ప సాయిలు బ్రెయిన్ ట్యూమర్ తో నిజామాబాద్ హోప్ ఆసుపత్రి లో చేరారు. శుక్రవారం శాస్త్ర చికిత్స చేసారు. ఈ మేరకు శనివారం యూనియన్ బృందం సాయిలును పరామర్శించారు.