లింగంపేట్ పంచాయతీ కార్యదర్శి కి షోకాజ్ నోటీస్ జారీ చేయాలి.

Kamareddy
1 Min Read

లింగంపేట్ పంచాయతీ కార్యదర్శి కి షోకాజ్ నోటీస్ జారీ చేయాలి.

జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. 

కామారెడ్డి ప్రజాజ్యోతి ప్రతినిధి జూన్ 21.

లింగంపేట మండల కేంద్రంలోని గత సంవత్సరం డయేరియా సోకిన ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు సరిగా లేకపోవడంతో ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ సంబంధిత లింగంపేట్ పంచాయతీ కార్యదర్శికి షోకాస్ నోటీసు జారీచేయాలని, జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పక్కాగా శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని లేనిచో చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి మురళిని ఆదేశించగా జిల్లా పంచాయతీ అధికారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లింగంపేట్ పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్, డిఆర్డిఓ సురేందర్, మండల స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *