భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులు నిర్దేశిత సమయంలో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్

1 Min Read

భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులు నిర్దేశిత సమయంలో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్

మహబూబ్ నగర్ జూన్ 20 ( ప్రజా జ్యోతి ప్రతినిధి ) భూ సమస్యల పై భూ భారతి రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులు నిర్దేశిత సమయం లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

అధికారులకు సూచించారు. శుక్రవారం అడ్డాకుల్ మండలం  గుడి బండ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ హాజరై అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా వివరాలుఅడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, తెలిపారు . రెవెన్యూ సదస్సుల లో వచ్చిన దరఖాస్తుల. వివరాల నమోదులో ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని, సంబంధిత రిజిస్టర్లలో తప్పని సరిగా వివరాలు నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ నమోదు రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు. ఈ కార్యక్రమం లో తహశీల్దార్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *