ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రేపు భూ భారతి – రెవెన్యూ సదస్సు
పరిగి, జూన్ 19 (ప్రజాజ్యోతి) :
పరిగి మండల రెవెన్యూ గ్రామ పరిధిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 20 శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ( ప్రజాభవన్) దగ్గర భూ భారతి- రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తునట్లు పరిగి మండల తహశీల్దార్ ఆనంద్ రావు తెలిపారు. ఈ సదస్సులో రెవెన్యూ అధికారులు భూ సమస్యల పరిష్కారానికి నూతన భూ భారతి చట్టం(ఆర్ఓఆర్) -2025 ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని, కావున ఇట్టి భూ భారతి రెవెన్యూ సదస్సులలో పరిగి రెవిన్యూ గ్రామం రైతులు, ప్రజలు పాల్గొని తమ భూమి సమస్యలు పరిష్కరించు కోగలరని కోరారు. అదేవిధంగా ధరఖాస్తు చేయు రైతులు పాత పాస్ పుస్తకం జిరాక్స్, కొత్త పాస్ పుస్తకం, రిజిస్టర్ దస్తావేజులు, ఆధార్ జిరాక్స్ అలాగే సంబంధిత డాక్యుమెంట్ ల జిరాక్స్ లు జతచేయాలని తెలిపారు.