– రెవెన్యూ సదస్సు ను నామమాత్రంగా చేయవద్దు
పరిగి, జూన్ 18 (ప్రజాజ్యోతి) :
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్పూర్ గ్రామంలో బుధవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పడగళ్ల ఆనంద్ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మాసాని పెంటయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆనంద్ మాట్లాడుతూ రెవెన్యూ భూముల గురించి చాలామంది రైతులు బాగా నష్టపోయారని ల్యాండ్ మిస్సింగ్ కావడం కొంతమందికి సక్షన్ డాటా ఎంట్రీ డీఎస్ పెండింగ్ కొత్త బుక్కులు రాకపోవడం ఆన్లైన్ కాకపోవడం దీనివలన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వారికి అందడం లేదని అన్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రెవెన్యూ సదస్సు నామమాత్రంగా చూడొద్దని రెండు నెలలు ఈ భూముల పరిష్కారం కాలేని పక్షంలో పెద్ద ఎత్తున రైతులు ఎమ్మార్వో కార్యాలయం దగ్గర నిరసనలు తెలియజేస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ ల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.