జూన్ 16 నుండి జులై 31 వరకు అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం ▪️అతిసార వ్యాధి, నివారణ చికిత్స కరపత్రం ఆవిష్కరించిన కలెక్టర్

1 Min Read

జూన్ 16 నుండి జులై 31 వరకు అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం

▪️అతిసార వ్యాధి, నివారణ చికిత్స కరపత్రం ఆవిష్కరించిన కలెక్టర్

మహబూబ్ నగర్ జూన్ 16 ( ప్రజా జ్యోతి ప్రతినిధి ) జూన్ 16 నుండి జులై 31 వరకు 45 రోజుల పాటు.అతిసార వ్యాధి నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ 0 నుండి 5 సంవత్సరాల పిల్లల లో అతిసార వ్యాధి ప్రబలకుండా నివారణలో బాగంగా పి.హెచ్.సి.లు,సబ్ సెంటర్ ల ద్వారా ప్రతి ఇంటికి ఓ.అర్.ఎస్.పాకెట్ లు, జింక్ టాబ్లెట్ లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

జిల్లా వైద్య డాక్టర్ కె.కృష్ణ మాట్లాడుతూ అతిసార వ్యాధి కారణంగా దేశంలో 4.8 శాతం పిల్లలు చనిపోతున్నారని తెలిపారు

మనదేశంలో ఇప్పుడున్న పరిస్థితిలో చిన్న పిల్లలలో డయేరియా సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఐదు సంవత్సరాలలోపు పిల్లలున్న ప్రతి ఇంటికి ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ మరియు జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 16వ తారీకు నుంచి జులై 31 వ తారీకు వరకు ఇంటింటికీ పంపిణీ, వీటిని వినియోగించడం గురించి ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లా అంతట ఈ కార్యక్రమం జరుగుతుందని వైద్యాధికారులు సిబ్బంది ఈ విషయంలో సరియైన సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఓఆర్ఎస్ వాడకం గురించి తెలిపారు. ఒక ప్యాకెట్ను లీటర్ మంచి నీటిలో కలుపుకొని నీళ్ళ విరేచనాలు ఉన్న పిల్లలకి త్రాపాలని సూచించారు. . ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్,రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు ,వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డా.భాస్కర్ నాయక్ ఇమ్ము నైజేషన్ అధికారిడాక్టర్ పద్మజ, జిల్లా మాస్ మీడియా అధికారి మంజుల తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *