శ్రీనుబాబు సమక్షంలో ఘనంగా ఐఎన్టీయూసీ నాయకుని జన్మదిన వేడుకలు

Karimnagar Bureau
1 Min Read

శ్రీనుబాబు సమక్షంలో ఘనంగా ఐఎన్టీయూసీ నాయకుని జన్మదిన వేడుకలు

రామగిరి(పెద్దపల్లి జిల్లా), జూన్ 15 :

ఐఎన్టీయూసీ ఆర్జి-3 బ్రాంచ్ సెక్రటరీ సందెల కుమారస్వామి జన్మదిన వేడుకలు ఆదివారం రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీలోని శ్రీపాద భవన్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీనుబాబు హాజరై, సందెల కుమారస్వామికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ, “సందెల కుమారస్వామి నిరంతరం కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న ఓ కర్తవ్యనిష్ఠ నాయకుడనీ, ఆయన ఆరోగ్యంగా, ఆయుష్మాన్‌గా నిండు నూరేళ్లు జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు. జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి, పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *