హాజీపూర్ తండా ఆలయంలో చోరీ

Kamareddy
1 Min Read

ఎల్లారెడ్డి జూన్- 15 ( ప్రజా జ్యోతి)

ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని హాజీపూర్ తాండలోని జగదాంబ మాత, సేవాలాల్ ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. తాండ వాసులు తెలిపిన వివరాల ప్రకారం… హాజీపూర్ తాండలో ఉన్న జగదాంబ మాత, సేవాలాల్ ఆలయంలో పూజారి దుప్య నాయక్ రోజువారి లాగే పూజలు నిర్వహించి అనంతరం అలయానికి తాళం వేసి వెళ్లారు. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయంలో ఉన్న హుండీ గొలుసుతో వేసిన తాళాన్ని విరగొట్టి ఆలయంలోకి చొరబడి సూమారు రూ.30వేలు నగదును అపహరించారు. ఆదివారం ఉదయం ఆలయ పూజారి దుప్య నాయక్ వచ్చి చూడగా ఆలయంలో ఉన్న కనిపించకపోవడంతో తాండ వాసులు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చి ఆలయంలో చుట్టూ పక్కల చూడగా ఆలయం పక్కన తాళాలు పగలగొట్టి ఉండడంతో అందులో నగదు కనిపించలేదు. దీంతో ఆలయంలో చోరీ జరిగిందని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *