ఆరోగ్యం ఎలా ఉందంటూ లబ్ధిదారుని ఇంటికి వెళ్లిన ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులు
కరీంనగర్ బ్యూరో, జూన్ 12, (ప్రజాజ్యోతి)
నగునూరు గ్రామానికి చెందిన రాజయ్య ఇటీవల కిడ్నీ సంబంధిత చికిత్సను రాజీవ్ ఆరోగ్యశ్రీ లో ఉచితంగా పొంది ఇంటికి వెళ్ల గా గురువారం
రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులు జనరల్ మేనేజర్ రాంబాబు, శ్రీనివాస్, రాజు లు ఆరోగ్యం ఎలా ఉందంటూ నేరుగా ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శ్రీ లో ఉచితంగా చికిత్స పొందిన విధానంను, ఆసుపత్రిలో ఉచిత ,భోజన వసతి, ఆపరేషన్ తీరు గురించి లబ్ధిదారున్ని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి లో ఏమైనా ఇబ్బందులు ఎదురైనవా.. అంటూ రాజయ్యను ప్రశ్నించగా నాకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్నానని , నాకు సహకరించిన ప్రభుత్వానికి, ఆరోగ్య శ్రీ అధికారులకు కృతజ్ఞతలు అంటూ సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం జూబ్లీ నగర్ కు చెందిన పావని ఇంటికి కూడా వెళ్లి ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. ఉచితంగా జరిగిందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట కరీంనగర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ డిస్టిక్ కో ఆర్డినేటర్ రాజు, జిల్లా మేనేజర్ విజయ్ కుమార్ ఉన్నారు.