తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కేటాయించిన శాఖల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల బాధ్యతలు అప్పగించారు. గడ్డం వివేక్కు కార్మిక శాఖతో పాటు గనులు, భూగర్భ వనరుల శాఖలను కేటాయించారు. వాకిటి శ్రీహరికి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక శాఖల బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు.
ఈ తాజా విస్తరణతో తెలంగాణ క్యాబినెట్లోని మంత్రుల సంఖ్య 15కు చేరింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలలో ఎలాంటి మార్పులు చేయకుండా, ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న శాఖలనే కొత్తగా నియమితులైన మంత్రులకు కేటాయించడం గమనార్హం.