కామారెడ్డి జిల్లా (ప్రజా జ్యోతి)
కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఘటన చోటుచేసుకుంది. వివరాల్లో కి వెళ్తే,టివిఎస్ ఎక్సల్ పైకి ఆర్టీసీ బస్సు దూసుకురావడంతో టివిఎస్ ఎక్సల్ వాహనంపై వెళ్తున్న తాత మనవడు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రం లో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.! మండలంలోని బస్వన్నపల్లి గ్రామానికి చెందిన నడిపి రాములు(50) తన మనవడు శ్రీహాన్స్ (04) కు కుక్క కరవడంతో రాజంపేట పిహెచ్.సికి టివిఎస్ ఎక్సల్ వాహనంపై వెళ్లారు. అక్కడినుంచి ఇంటికి ఎక్సల్ వాహనంపై వెళ్తున్నారు. రాజంపేట వైపు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు టివిఎస్ ఎక్సల్ ను ఢీకొంది. ఈ ఘటనలో బస్సు కింద ఎక్సల్ వాహనం ఇరుక్కుపోవడంతో తాత మనవడు ఇద్దరు మృతి చెందారు. బస్సు కింద ఇరుక్కున్న వాహనాన్ని జేసిబి సహాయంతో బయటకు తీశారు. విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు.ఈ విషయంపై బాధిత కుటుంబం, గ్రామంలో విషమచాయలు అలుముకున్నాయి.