విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచి మానేరు విద్యా సంస్థలు….

Karimnagar Bureau
2 Min Read

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచి మానేరు విద్యా సంస్థలు….

విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హగ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రారంభించిన బండి

కరీంనగర్ బ్యూరో, జూన్ 07, (ప్రజాజ్యోతి)
ప్రస్తుత కాలంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచి కరీంనగర్ లోని మానేరు విద్యా సంస్థలు అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో తీగలగుట్టపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన మానేరు హగ్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను శనివారం ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఉన్నత విలువలు, అత్యున్నతమైన అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన మానేరు విద్యాసంస్థల్లో జరుగుతున్నదని కొనియాడారు. గత 39 సంవత్సరాలుగా కరీంనగర్ లో విద్యా బోధనను కొనసాగిస్తున్న మానేరు విద్య సంస్థల యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించడం మానేరు విద్యాసంస్థలకే దక్కిందన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యారంగంలో 39 ఏళ్లుగా సేవలందించడం అద్భుతం అని అన్నారు. కేవలం విద్యారంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో మానేరు విద్యాసంస్థలు పాలుపంచుకోవడం అభినందనీయమన్నారు. మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యనందించడమే లక్ష్యంగా ప్రపంచ స్థాయిలో విద్యాబోధనను అందించే విధంగా హగ్స్ అండ్ హార్ట్స్ స్కూల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ ఐ) తరహా విద్యా విధానాన్ని ఈ పాఠశాలలో బోధించడం ఉన్నట్లు తెలిపారు. ఇటీవల వెల్లడైన జేఈఈ, ఐఐటి, ఇంటర్, ఎంసెట్ ఫలితాల్లో మానేరు విద్యాసంస్థలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలతో ఆల్ ఇండియా ర్యాంకులను కైవసం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సి బి ఎస్ ఈ, పదవ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులను కైవసం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. అంతకు ముందు అతిథులను విద్యాసంస్థల్లో ఆధ్వర్యంలో ఘనంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్, మాజీ కార్పొరేటర్లు కోలగానే శ్రీనివాస్, కాసేట్టి లావణ్య శ్రీనివాస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, విద్యాసంస్థల ప్రిన్సిపల్ లు, ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *