- 12 కిలోల గంజాయి పట్టివేత
కామారెడ్డి టౌన్ ప్రజా జ్యోతి న్యూస్ జూన్ 4:
కామారెడ్డి నాగవల్లి ఎక్స్ ప్రెస్ రైలు లో అక్రమంగా తరలిస్తున్న 12 కిలోల ఎండు గంజాయిని కామారెడ్డి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు మంగళవారం కామారెడ్డి రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సంబాల్ పూర్ నుంచి నాందేడ్ కు వెళ్తున్న నాగవల్లి ఎక్స్ ప్రెస్ లో ఎండు గంజాయి తరలిస్తున్నట్టుగా సమాచారంతో కామారెడ్డి రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, కెసైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమనాస్పదంగా ఉన్న బ్యాగు తెరిచి చూడగా 12 కిలోల ఎండు గంజాయి ఉన్నట్టుగా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు ఆరు లక్షలు ఉంటుందని తెలిపారు.నిందితుల కోసం గాలిస్తున్నట్టు సిఐ తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలు తరలిస్తే ఎన్.డి.పి.ఎస్ యాక్టు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ కుమార్, రైల్వే ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ రవీంద్ర బాబు, సిబ్బంది పాల్గొన్నారు