జకీర్ నాయక్ తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూ.. ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

V. Sai Krishna Reddy
1 Min Read

ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ కు గూఢచర్యం చేస్తున్న విషయం బయటపడడంతో ప్రముఖ యూట్యూబర్లపై అధికారులు నిఘా పెట్టారు. పాకిస్థాన్ లో పర్యటించిన యూట్యూబర్ల వివరాలు ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద యూట్యూబర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇందులో భాగంగా సన్నీ యాదవ్ ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. సన్నీ యాదవ్ యూట్యూబ్ ఖాతాలో జకీర్ నాయక్ తో ఇంటర్వ్యూ వీడియోలు బయటపడ్డాయని అధికార వర్గాలు తెలిపాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టే జకీర్ నాయక్ ను సన్నీయాదవ్ ఇంటర్వ్యూ చేశాడని, ఇందుకు సంబంధించిన వీడియోలు అతడి యూట్యూబ్ లో లభించాయని అధికారులు తెలిపారు.

భారతదేశంలోనే పుట్టిపెరిగిన జకీర్ నాయక్.. తన ప్రసంగాలతో మత విద్వేషాలను రెచ్చగొడుతుంటాడు. అతడిపై ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2016లోనే జకీర్ నాయక్ పై మనీలాండరింగ్ కేసు నమోదైంది. దీంతో జకీర్ నాయక్ మలేషియాకు పారిపోయాడు. కేంద్ర ప్రభుత్వం అతడిని మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది. అతడిని వెనక్కి రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తో భయ్యా సన్నీయాదవ్ ఇంటర్వ్యూ వీడియోలు బయటపడడంతో ప్రస్తుతం వారిద్దరి మధ్య సంబంధాలపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *